Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్రామ్, మెహరీన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా..'. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో నిర్మాత ఉమేష్ గుప్త మాట్లాడుతూ,'కళ్యాణ్రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఎంత మంచివాడవురా' టైటిల్ని ఎనౌన్స్ చేసినప్పుడు మాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్తో అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. 'గీత గోవిందం', 'మజిలీ' వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన గోపీసుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూరుస్తున్నారు. జులై 31న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని స్టార్ట్ చేశాం. ఆగస్ట్ 17 నాటికి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. రెండు యాక్షన్ ఎపిసోడ్స్తోపాటు కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించబోతున్నాం. అక్టోబర్లో హైదరాబాద్లోను, నవంబర్లో చిక్మంగుళూర్లోను షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాగా దీన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 'మంచి కథ, మంచి హీరో, మంచి టీమ్, మంచి ఫీల్తో ఈ సినిమాని చేస్తున్నాం. ఇటీవలే దిగ్విజయంగా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్కి రెడీ అవుతున్నాం. టైటిల్ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం'
అని దర్శకుడు సతీష్ వేగేశ్న అన్నారు. వి.కె.నరేష్, సుహాసిని, తనికెళ్ళభరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిషోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు.