Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్ ఆర్ ఆర్' స్నేహం ప్రధానంగా సాగుతుంది. ఇందులో భాగం కావడం, ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా' అని అలియా భట్ అన్నారు.
బాలీవుడ్లో క్రేజీ కథానాయికగా పేరొందిన అలియా 'ఆర్ ఆర్ ఆర్'తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చరణ్ సరసన అలియా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అలియా తెలిపింది. స్నేహం ప్రధానంగా సాగే చిత్రమిదని చిత్ర పోస్టర్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి చెబుతూ, 'నేనెక్కడ మారిపోతానో అని ఎప్పడూ భయపడుతుంటాను. అందుకే చాలా సార్లు నన్ను నేను చెక్ చేసుకుంటా. విజయం ప్రభావం నాపై ఉంటుందేమో అనుకుంటాను. నేనేమైనా మారిపోతున్నానా అనిపిస్తుంది. ఈ విషయంలో మా ఫాదర్, కరణ్ జోహార్ ఎప్పుడు చెబుతుంటారు ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి ఉండమని. దాన్ని ఎప్పుడూ ఫాలో అవుతాను' అని తెలిపింది. ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర', 'సడక్ 2', 'ఇన్షాల్లా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.