Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'రాక్షసుడు'. ఇటీవల విడుదలైన సినిమా పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ, 'మా సినిమా విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గవ వారంలోకి అడుగుపెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకో రెండు వారాలు ఆడే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల్ని నుంచి పెద్ద వాళ్ల వరకు, ఫ్యామిలీ ఆడియెన్స్కి సినిమా బాగా నచ్చుతుంది. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చిత్రమిది. మంచి సందేశాన్ని అందించింది. సినిమాలో బ్యూటిఫుల్గా కనిపిస్తూ, మెచ్యూర్డ్ నటనతో అనుపమా ఆకట్టుకుంటోంది. ఆమె ఇటీవల జరిగిన సక్సెస్ సెలబ్రేషన్లో మిస్ అయ్యారు. ఇప్పుడు తన ఆనందాన్ని పంచుకోవడం మాకు హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ఇంత పెద్ద హిట్ కావడం మరింత ఆనందంగా ఉంది' అని అన్నారు.
'సినిమా కలెక్షన్లు బాగున్నాయి. ఐదారు వారాల్లో కూడా సినిమాకి ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాం' అని దర్శకుడు రమేష్ వర్మ చెప్పారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చెబుతూ, 'అనారోగ్య కారణాల వల్ల చిత్ర సక్సెస్ మీట్కి రాలేకపోయాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థ్యాంక్స్. సాయి ఎంతో సపోర్ట్నిచ్చారు. తను నైస్ పర్సన్. మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి బాగా నచ్చింది. ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది. అమ్మాయిలు చూడాల్సిన చిత్రమిది. నేను మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. మంచి సినిమాలో నటిస్తే కచ్చితంగా అది మనకు హెల్ప్ అవుతుంది. ఇది కూడా నా కెరీర్కి హెల్ప్ అవుతుందనుకుంటున్నా' అని చెప్పారు.