Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, క్రితి శెట్టి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'ఉప్పెన' చిత్రం రూపొందుతుంది. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా బుధవారం నుంచి విజరు సేతుపతి షూటింగ్లో జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ రూపొందుతున్న చిత్రమిది. అలాగే సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారథి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు.
ఈ షెడ్యూల్లో వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి, రాజీవ్ కనకాలతోపాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు నలభై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. అవుట్పుట్ బాగా వస్తుంది' అని తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్దత్, ఎడిటింగ్: నవీన్ నూలి. సీఈఓ: చెర్రీ.