Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక గీతాల్లో మెరిసి ఆడియెన్స్ని మెస్మరైజ్ చేయడంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనకు తానే సాటి. మొదటి సారి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేందుకు ఓ స్పెషల్ సాంగ్తో రాబోతోంది. ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం ప్రత్యేక పాటలో నటించింది. 'బ్యాడ్ బారు' అంటూ సాగే ఈ పాటని ఇటీవల చిత్ర బృందం రిలీజ్ చేసింది. దాదాపు 20 మిలియన్స్కిపైగా వ్యూస్ని సొంతం చేసుకున్న ఈ పాట ప్రస్తుతం సర్వత్రా వైరల్ అయ్యింది. ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ ప్రత్యేక పాటలో ఆడిపాడేందుకు జాక్వెలిన్ కూడా భారీగానే పారితోషికంగా పుచ్చుకుందని సమాచారం. కేవలం ఈ పాట కోసం జాక్వెలిన్ ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్గా అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం జాక్వెలిన్ హిందీలో 'డ్రైవ్' చిత్రంలో నటిస్తుంది. గతంలోనూ 'హౌస్ఫుల్', 'బాఘి 2', 'రామయ్య వస్తావయ్యా' చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో జాక్వెలిన్ సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన విషయం విదితమే.