Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం నేను కేవలం 25శాతం లివర్తోనే జీవిస్తున్నా. దీన్ని గుర్తించకపోవడం వల్ల చాలా నష్టపోయాను' అని అమితాబ్ బచ్చన్ చెప్పి తన ఫ్యాన్స్నే కాదు, యావత్ సినీ ప్రేక్షక లోకానికే షాక్ ఇచ్చారు. స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ తన ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. 'ఒకప్పుడు నేను క్షయ, హెపటైటిస్ బి వ్యాధులతో పోరాడాను. దాదాపు ఎనిమిదేండ్ల వరకు వీటిని గుర్తించలేదు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. చెడు రక్తం కారణంగా అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు కేవలం 25 శాతం లివర్తోనే బతుకుతున్నా. క్షయ వ్యాధికి నివారణ ఉంది. కానీ దాన్ని సరైన సమయంలో గుర్తించలేకపోవడం వల్ల నేను చాలా నష్టపోయా. ఇది నేను పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు. నాలా మరొకరు బాధపడకూడదని చెబుతున్నా. పరీక్షలు చేసుకోకపోతే వాటిని ఎప్పటికీ గుర్తించలేరు' అని తెలిపారు. ఇదిలా ఉంటే, అమితాబ్ ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి'తోపాటు 'జుండ్', 'తేరా యార్ హూన్ మెయిన్', 'బట్టర్ఫ్లై', 'బ్రహ్మాస్త్ర', 'చెహెర్', 'గులాబో సిటాబో' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.