Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల తన తండ్రి మహేష్భట్ ఐకానిక్ చిత్రం 'సడక్' సీక్వెల్ 'సడక్ 2'లో తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలోనే అలియాభట్ నటిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతుంది. అలాగే సోనమ్ కపూర్ సైతం తన తండ్రి అనిల్ కపూర్ ఐకానిక్ చిత్రం 'మిస్టర్ ఇండియా' రీమేక్లో నటించాలనుకుంటుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'నాన్న నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమా నాకెంతో ఇష్టం. 1987లో విడుదలైన ఈ సినిమాని ఎప్పటికీ రీమేడ్ చేయలేం. కానీ ఒకవేళ చేస్తే అందులో నేను నటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 'మిస్టర్ ఇండియా'గా ఒక్కరు మాత్రమే ఎందుకుండాలి. నాకూ అలా అనిపించుకోవాలని ఉంది. ఆ సినిమాలో ప్రతి ఒక్కరు తమ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఈ సినిమాని ఇప్పటికీ అనేక మంది ఇష్టపడతారు' అని తెలిపింది. ప్రస్తుతం సోనమ్ కపూర్ 'ది జోయా ఫ్యాక్టర్' చిత్రంలో నటించింది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించగా ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఇదిలా ఉంటే,
తన తండ్రి అనిల్ కపూర్తో కలిసి సోనమ్ ఇటీవల 'ఏక్ లడ్కీ కో దేఖా తో హైసా లగా' చిత్రంలో నటించిన విషయం విదితమే.