Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, మాధవన్, అంజలి, షాలిని పాండే ఇతర కీలక పాత్రధారులుగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ నేడు (బుధవారం) ఉదయం 11.11 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రం గురించి యూనిట్ చెబుతూ, 'విభిన్న కథాంశంతో థ్రిల్లర్గా సినిమా సాగుతుంది. శరవేగంగా చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటం విశేషం. ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్స్కి మంచి స్పందన లభించింది. సినిమాకి గోపీసుందర్ సంగీతం, ఆర్ఆర్ హైలైట్గా నిలుస్తాయి. నేడు విడుదల కాబోయే ఫస్ట్లుక్ అన్ని వర్గాల ఆడియెన్స్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అని తెలిపింది.