Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ది స్కై ఈజ్ పింక్' చాలా ప్రత్యేకమైన సినిమా. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్లో చేయడానికి ఇదే సరైన స్క్రిప్ట్ అనిపించింది. సినిమా చేయడం మాటల్లో చెప్పలేని అనుభవం' అని ప్రియాంక చోప్రా భావోద్వేగ భరితంగా చెప్పారు. 2016లో వచ్చిన 'జై గంగాజల్' చిత్రం తర్వాత ప్రియాంక బాలీవుడ్లో నటించలేదు. ఆ తర్వాత హాలీవుడ్ ఆఫర్స్ రావడంతో హిందీ సినిమాలు ఒప్పుకోలేదు. తాజాగా ఆమె బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తూ 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో నటించారు. సోనాలీ బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ఇతర ముఖ్య పాత్రధారులు. మోటివేషనల్ స్పీకర్ ఆయేషా చౌదరి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని ఇటీవల టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో చిత్ర బృందంతోపాటు ప్రియాంక వైట్ అండ్ బ్లాక్ గౌనుతో ముస్తాబై సందడి చేశారు. రెడ్ కార్పెట్పై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా దర్శకురాలు సోనాలీ బోస్ని హత్తుకుని భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. సినిమాకి వచ్చిన అనూహ్య స్పందనకి ప్రియాంక బాగా ఎమోషనల్ అయ్యారు.