Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరోహీరోయిన్లుగా తిరు దర్శకత్వంలో ఏ కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'చాణక్య'. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం శనివారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ, 'రెండేండ్ల క్రితం తిరు వచ్చి ఈ కథ చెప్పారు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కథ విన్నాక కొన్ని మార్పులు చెప్పాను. అవి నువ్వు కన్వీన్స్ అయితేనే ముందు కెళ్దామన్నాను. చాలా ఓపికగా మార్పులు చేశాడు. నాకు ఏదైతే కథ చెప్పారో, యదాతథంగా తెరకెక్కించారు. నిర్మాత అనిల్ సుంకర మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చాలా సార్లు విన్నా. సినిమాకి ఏం కావాలో అది ఆయన అందించారు. ఆయనతో మళ్ళీ పనిచేయాలనుకుంటున్నా. వెట్రి కెమెరా వర్క్ ప్లస్ అవుతుంది. మెహరీన్ బ్రిలియంట్ నటి. జరీనా కీలక పాత్రలో ఆకట్టుకుంటుంది. స్పై థ్రిల్లర్గా సాగే చిత్రమిది. సినిమా చేశాక నమ్మకం కలిగింది. కచ్చితంగా ఆకట్టుకుంటుంది' అని అన్నారు. 'సినిమాలో చెప్పినట్టు మనం అబద్దం, నిజం అనే రెండు జీవితాల్లో బతుకుతున్నాం. రెండు లైఫ్లను లీడ్ చేస్తుంటాం. దీనికి గోపీచంద్ నటించిన అర్జున్పాత్ర సెట్ అవుతుంది. ఏడేండ్లుగా సినిమా కథపై వర్క్ చేస్తున్నా. నాకు హార్ట్, సోల్ ఇలా అన్నీ ఇదే. అబ్బూరి రవి బ్రిలియంట్ రైటర్. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాను. గోపీచంద్ వారికి భిన్నమైన నటులు. చాలా సపోర్ట్ చేశారు. రాజస్థాన్లో యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ప్రమాదం జరిగింది. మేం ఎంతో టెన్షన్ పడ్డాం. కానీ రెండు నెలల్లో తిరిగి వస్తానని మాకు ధైర్యాన్నిచ్చారు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. దసరాకి విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని దర్శకుడు తిరు తెలిపారు. నిర్మాత అనిల్ సుంకర చెబుతూ, 'మొదట ఓసారి తిరు కథ చెప్పారు. అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మరొకరికి కోసం కాల్ చేస్తే అది ఈ తిరుకి వెళ్ళింది. అలా ఈ ప్రాజెక్ట్ వర్కౌంట్ అయ్యింది. గోపీచంద్కి సూట్ అవుతుందని ఆయన్ని కలిశాం. కథ నచ్చి ఓకే చేశారు. తిరు చాలా తెలివైన డైరెక్టర్. ఆయన కెరీర్లో ఇదొక ల్యాండ్మార్క్ చిత్రమవుతుంది. సినిమా మంచి అనుభూతినిస్తుంది. అందరు ఎంజారు చేస్తారు' అని తెలిపారు. 'తిరు మొదట ఈ కథ నాకే చెప్పారు. ఇందులో యాక్షన్తోపాటు థ్రిల్ చేసే అంశాలున్నాయి. గోపీచంద్ యాక్షన్ని మరో కోణంలో చూడొచ్చు. నేనా, నువ్వా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగుతుంది' అని అబ్బూరి రవి చెప్పారు.