Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సాహౌ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది శ్రద్ధా కపూర్. అలాగే ఆమె హిందీలో నటించిన 'చిచ్ఛోర్' సైతం ఇటీవల విడుదలై మంచి ప్రశంసలందుకుంది. లేటెస్ట్గా 'స్ట్రీట్ డాన్సర్'లో నటిస్తోంది. అలాగే బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధా తప్పుకుంది. దీని గురించి శ్రద్ధా మాట్లాడుతూ, 'సినిమా ప్రారంభం డిలే కావడంతో డేట్స్ ఇష్యూ వచ్చింది. ఆ టైమ్లోనే నాకు డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది.అంతేకాదు 'ఏబీసీడీ' సీక్వెల్ కూడా చేయాల్సింది. ఆ చిత్ర దర్శకుడు రెమో డి సౌజా నా డాన్స్ గురువు.
తప్పని పరిస్థితుల్లో సైనా ప్రాజెక్ట్ని వదులుకున్నా. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ మిస్ అయ్యాననే అసంతృప్తి లేదు' అని తెలిపింది. రెమో డి సౌజా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్ట్రీట్డాన్సర్'లో వరుణ్ ధావన్తో కలిసి శ్రద్ధా నటిస్తుంది. ఇందుతో తన పాత్ర గురించి శ్రద్ధా చెబుతూ, 'గతంలో నేను నటించిన అన్ని పాత్రలకు ఇది పూర్తి భిన్నం. నేనొక కొత్త లుక్లో కనిపిస్తా' అని తెలిపింది. దీంతోపాటు 'బాఘి 3'లోనూ టైగర్ షరాఫ్తో కలిసి నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధాకి, 'ప్రియమైన శ్రద్ధా మీ రాక మాకు ఆనందకరం. అది మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. 'బాఘి' ఫ్రాంఛైజీలోని మూడో పార్ట్కి స్వాగతం. మీ యాక్షన్ చూసేందుకు మేం వెయిట్ చేయలేకపోతున్నాం' అంటూ యూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.