Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'తెనాలి రామక్రిష్ణ బి.ఎ.బి.ఎల్'. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, హన్సిక టీజర్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'దర్శక నిర్మాతలని చూస్తుంటే 'చిచ్చోర్' సినిమా గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమా తీశారు. కొత్తగా ఉండే ఎమోషనల్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు నవ్వుకునేలా, ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. రాజసింహా అద్భుతమైన కథని అందించారు. సాయి కార్తీక్ 75వ సినిమా మాది కావడం ఆనందంగా ఉంది. ప్రతి పాట మరో లెవల్లో ఉంటుంది. హన్సిక బాగా చేసింది. సినిమా చూసుకున్నప్పుడు నాకు నేనే కొత్తగా అనిపించాను. ఆడియెన్స్కి కూడా బాగా నచ్చుతుందని నమ్ముతున్నా' అని అన్నారు. 'ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది. అందరికి థ్యాంక్స్' అని హన్సిక తెలిపారు. దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, 'ఛోటా కె.నాయుడు సడెన్ సర్ప్రైజ్. ఆయనకు టీజర్ నచ్చడం హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఇది సౌండ్ క్రియేట్ చేస్తుంది. నేను హీరోలతో ఫస్ట్టైమ్ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇది కూడా ఆ జాబితాలోనే హిట్ అవుతుందని ఆశిస్తున్నా. సపోర్ట్ చేసిన హన్సికకి థ్యాంక్స్. నిర్మాతలు నా ఫ్రెండ్స్. నాకోసం ఎంతో చేశారు. వారికి థ్యాంక్స్ చెప్పడం తక్కువే అవుతుంది' అని చెప్పారు. 'పదేండ్ల వయసు నుంచి దర్శకుడు, నేను, సంజీవ్రెడ్డి, శ్రీనివాసులు స్నేహితులం. ఎప్పట్నుంచో సినిమా చేద్దామనుకున్నాం. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చి, మమ్మల్ని ప్రమోట్ చేశారు. కొత్తగా మేం చేసిన ప్రయతాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి చెప్పారు.