Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్విన్బాబు, అవిక గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వంలో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'రాజుగారిగది 3'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఆదివారం జరిగింది. హీరో వెంకటేష్ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఓంకార్ మాట్లాడుతూ, 'మొదటి సినిమా మంచి విజయం సాధించింది. రెండో పార్ట్లో కామెడీ తగ్గిందన్నారు. ఆ కామెడీని పెంచి ఆడియెన్స్ నవ్వించడం కోసమే ఈ సినిమాని తెరకెక్కించాం. సినిమాని రెండు నెలల్లో పూర్తి చేశామంటే అందుకు కారణం కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, సాయిమాధవ్ బుర్రా, సంగీత దర్శకుడు షబ్బీర్. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు. మా తమ్ముడు అశ్విన్ ఎంతగా సపోర్ట్ చేశాడో, అలాగే అవికా సహకరించింది. సినిమా పెద్ద హిట్ కాబోతుందని డబ్బింగ్ చెప్పాక అలీగారు చెప్పడం మెమరబుల్. దసరాకి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు. రైటర్ సాయిమాధవ్ బుర్రా చెబుతూ, ''రాజుగారిగది' మొదటి సినిమాకి పనిచేశా. అది పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఈ చిత్రం కూడా దానికి మించి విజయం సాధిస్తుంది. చాలా మంచి కథ. ఇందులో అందమైన దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం భయాన్ని కూడా ఇష్టపడేలా చేస్తుంది. కానీ ఐ లవ్ యూ చెబితే మాత్రం తనకి నచ్చదు. రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునే చిత్రమవుతుంది. అద్భుతంగా వచ్చింది. భయపెడుతూనే నవ్విస్తుంది' అని చెప్పారు. 'నన్ను సరికొత్తగా తయారు చేసిన అన్నయ్య ఓంకార్కి థ్యాంక్స్. వెయ్యికిపైగా సినిమాలు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పనిచేయడం ఆనందంగా ఉంది. రూపాయికి మూడొంతుల వినోదాన్ని పంచే చిత్రమవుతుంది' అని అశ్విన్ బాబు అన్నారు.