Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో ఎస్ఆర్టి ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'డిస్కోరాజా'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు.
ఇటీవల గోవా షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, '15 రోజుల పాటు గోవాలో ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేశాం. అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. అలాగే యూరప్లోని ఐస్ల్యాండ్లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం నిర్మాత రామ్ తళ్ళూరి భారీగా ఖర్చు చేస్తున్నారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ విజన్కి తగ్గట్టు బడ్జెట్ విషయంలో ఆయనకెక్కడా రాజీపడటం లేదు. నేటి (మంగళవారం) నుంచి ఐస్ల్యాండ్లో జరపబోయే షెడ్యూల్ను దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చిత్రీకరించే సన్నివేశ నిడివి కేవలం నాలుగు నిమిషాలే అయినప్పటికీ కథానుగుణంగా భారీ బడ్జెట్ డిమాండ్ చేసింది. ఈ షెడ్యూల్లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్లోని 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' చిత్రానికి పని చేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలాగే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు వర్క్ చేసిన ఊలి టీం ఈ చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు. సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉండే ఎపిసోడ్ ఇది. రవితేజ సరసన పాయల్ రాజ్ఫుత్, నభా నటేష్, తాన్యా హౌప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హంగులతో, గ్రాఫిక్స్కి పెద్ద పీట వేసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్, అబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్నూలి ఎడిటింగ్ ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. బాబీ సింహా ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీ లుక్కి అత్యద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్కి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతోంది' అని చెప్పింది.