Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఛారు అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ కథను బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను కథానాయకుడు ప్రభాస్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'మనోవిరాగి' అనే టైటిల్ని ఖరారు చేశారు.
'ప్రత్యేక వ్యక్తిపై ప్రత్యేక నిర్మాతలు తీస్తున్న ప్రత్యేక సినిమా ఫస్ట్లుక్ను ప్రత్యేకమైన రోజున విడుదల చేస్తున్నాం. పుట్టిన రోజు శుభాకాంక్షలు మోదీ సార్.. సంజయ్ లీలాభన్సాలీ, మహావీర్ జైన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫస్ట్లుక్ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధాని అన్టోల్డ్ స్టోరీ. సంజయ్ త్రిపాఠీ దర్శకత్వం వహిస్తున్నారు' అని ప్రభాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిందీ పోస్టర్ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడుతూ,'ఈ కథ కోసం చాలా పరిశోధనలు చేశాం. యువకుడిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ జీవితం మలుపు తిరిగిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలియని కథ.. తెలుసుకోవాల్సిన కథ' అని చెప్పారు.