Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబట్టి అటు హీరోకి మంచి పేరు తీసుకు రావడంతోపాటు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాతలు పూరీ జగన్నాథ్, ఛార్మీలు 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ను బహుమతుల రూపంలో సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా సినిమా బ్లాక్బస్టర్ అయితే దర్శకుడికి నిర్మాత లేదా హీరో గిప్ట్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ పూరీ దర్శకత్వం వహించడంతోపాటు తన సొంత బ్యానర్లోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి ఛార్మీ కూడా మరొక నిర్మాత. వీరిద్దరూ ఈ చిత్ర సక్సెస్ను గిఫ్ట్స్ రూపంలో ఒకొరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఛార్మీకి పూరీ బీఎండబ్ల్యూ7 సిరీస్ను గిఫ్ట్గా ఇస్తే, పూరీకి ఛార్మీ రేంజ్ రోవర్ వోగ్ని బహుమతిగా ఇవ్వడం విశేషం.