Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పైసా వసూల్' వంటి హిట్ సినిమా తర్వాత బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమాకి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. లేటెస్ట్గా వీరిద్దరూ కొత్త సినిమాకి సంబంధించిన అన్ని వివరాలను తుది రూపానికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విజరుదేవరకొండతో 'ఫైటర్' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పూరీ ఉన్నారు. అంతేకాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎ.ఎస్.రవికుమార్, బోయపాటి శ్రీనుల ప్రాజెక్ట్ల తర్వాత పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తారట. ఏదిఏమైనా 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్బస్టర్ తర్వాత సినిమాల విషయంలో పూరీ స్పీడ్ పెంచారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరీ మాదిరిగానే బాలయ్య కూడా అంతే స్పీడ్లో ఉన్నారు. ఇప్పటికే 105వ చిత్రంలో నటిస్తూ, 106వ చిత్రానికి గ్రీన్సిగల్ ఇచ్చిన బాలయ్య 107వ చిత్రాన్ని పూరీతో చేసేందుకు డిసైడ్ అయ్యారు.