Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేటి తరం తెలుసుకోవాల్సిన వీరుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం చాలా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర ప్రీ -రిలీజ్ వేడుకను చాలా గ్రాండ్ స్కేల్లో ఈనెల 22న చేస్తున్నట్టు చిత్ర బృందం మంగళవారం అధికారికంగా తెలిపింది. తొలుత ఈనెల 18న ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించాలనుకున్నారు. సరిగా లేని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుకను 22న జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే ఈ చిత్ర ట్రైలర్ను నేడు (బుధవారం) రిలీజ్ చేయబోతున్నట్టు కూడా 'సైరా..' బృందం తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.