Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొంది బ్లాక్బస్టర్ హిట్ దిశగా పయనిస్తోంది. ఒక్క హిందీ వర్షెన్లోనే ఇప్పటివరకు 153 కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేసింది. ఒక తెలుగు సినిమా బాలీవుడ్లో 150 కోట్ల రూపాయల మార్క్ని దాటడం విశేషంగా భావిస్తున్నాం' అని 'సాహో' చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ''సాహో' సినిమా రిలీజైన ఫస్ట్డే నుంచే కలెక్షన్ల పరంగా విశేష స్పందన వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్టయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 450 కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేయడం ఓ ఎత్తయితే, ఒక్క హిందీలోనే 153 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం మరో ఎత్తు. మన తెలుగు సినిమా సత్తాని మరోమారు బాలీవుడ్లో చాటిన సినిమా ఇది. అలాగే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి 130 కోట్ల రూపాయల్ని ఈ చిత్రం కైవసం చేసుకోవడం కూడా మరో విశేషం. పాన్ ఇండియా సినిమాగా అందరి మన్ననలు పొందిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో సైతం మంచి కలెక్షన్లని వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్కీలు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే.