Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్తోపాటు సౌత్లోనూ క్రేజీ కథానాయికగా కైరా అద్వానీ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కైరా తాజాగా మరో హర్రర్ కామెడీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ప్రస్తుతం హర్రర్ కామెడీ 'కాంచన' చిత్ర రీమేక్ 'లక్ష్మీ బాంబ్'లో అక్షరు కుమార్కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకత్వం వహించడం విశేషం. ప్రస్తుతం ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
'చంద్రముఖి' హిందీ వెర్షన్ 'బుల్ భులైయా'గా తెరకెక్కి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.
దీనికి సీక్వెల్గా 'బుల్ భులైయా2'ని రూపొందిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీక్ అర్యన్ సరసన కైరా నటించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 31న విడుదల చేయనున్నారు. 'గుడ్ న్యూస్', 'షేర్షా', 'ఇందూ కి జవానీ' చిత్రాల్లో నటిస్తూ
బిజీగా ఉన్న కైరా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ విజరు సినిమాలో నటించడం విశేషం.