Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి'తో ప్రభాస్ పౌరాణిక చిత్రాలకు బాగా సూట్ అవుతాడని నిరూపించుకున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో ఆయన రావణుడిగా మారబోతున్నాడట. 'బాహుబలి'లో అమరేంద్ర బాహుబలిగా మెప్పించిన ఆయన మున్ముందు అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో వెండితెరపై మెరవనున్నట్టు తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా 'రామాయణ్' పేరుతో భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నితీష్ తివారీ, రవి ఉద్యవార్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే రాముడి పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకొనెని ఫైనల్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామాయణంలో అత్యంత కీలకమైన, బలమైన పాత్ర రావణుడిది. ఈ పాత్ర కోసం ప్రభాస్ని ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్తో చిత్ర బృందం చర్చలు జరిపినట్టు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభాస్కి సౌత్తోపాటు హిందీలోనూ మంచి మార్కెట్ ఉంది. 'బాహుబలి', 'సాహో' చిత్రాల ఇమేజ్ కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ పాత్రకి ప్రభాస్ గ్రీన్ సిగల్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
మూడు భాగాలుగా తెరకెక్కనున్న 'రామాయణ్' చిత్రంలోని మొదటి భాగాన్ని 2021లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం ఇటీవల విడుదలై భారీ కలెక్షన్ల దిశగా పయనిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూలు చేయడంతో ఓ ఎత్తయితే, ఒక్క బాలీవుడ్లోనే దాదాపు 155 కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేయడం మరో ఎత్తు. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన విషయం విదితమే.