Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ''రణరంగం' వంటి సినిమా తర్వాత మా బ్యానర్లో ప్రొడక్షన్ నెం.8గా నాగశౌర్య హీరోగా తెరకెక్కించడం ఆనందంగా ఉంది. 'ఊహలు గుసగుసలాడే'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య 'దిక్కులు చూడకు రామయ్య', 'ఛలో', ఇటీవల 'ఓ బేబి'తో నటుడిగా ఆకట్టుకున్నారు. విభిన్న కథ చిత్రాలు చేస్తున్న ఆయనకిది మరో భిన్నమైన చిత్రమవుతుంది. ఈ సినిమా ద్వారా లక్ష్మి సౌజన్య అనే మహిళ దర్శకురాలు డైరెక్టర్గా చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. మంచి కథాబలముతో సినిమాని తెరకెక్కిస్తున్నాం. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు, నటించే నటీనటులు, పనిచేసే టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అక్టోబర్లో చిత్రీకరణని ప్రారంభించి వచ్చే ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా సినిమాని గ్రాండ్గా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.