Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న 28వ చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ని గురువారం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెబుతూ, ''యూటర్న్' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మా బ్యానర్లో గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్నంది దర్శకత్వంలో కొత్త సినిమాని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ఇప్పటికే గోపీచంద్, సంపత్ కాంబినేషన్లో 'గౌతమ్నంద' వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకులు.