Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన 'మహర్షి' చిత్రం ఈ ఏడాది సమ్మర్లో విడుదలై మంచి విజయం సాధించింది. రైతు సమస్యలను, వారి ప్రాధాన్యతని తెలిపిన ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ టైమ్లో మరోసారి తాము కలిసి పనిచేయాలనుకుంటున్నామని ఇటు మహేష్బాబు, అటు దర్శకుడు వంశీపైడిపల్లి తమ ఆసక్తిని తెలిపారు. తాజాగా మహేష్ కోసం మరో బలమైన కథని వంశీ సిద్ధం చేశారట. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మహేష్కి పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ని నెరేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ తర్వాత 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా ఉంటుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. తాజాగా వంశీపైడిపల్లి కథ ఓకే అయితే నెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఏది నిజమనేది మున్ముందు తేలనుంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.