Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే ప్రధాన పాత్రధారులుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'మా 'గద్దలకొండ గణేష్' సినిమా విడుదలైనప్పట్నుంచి అందరి నోటా సూపర్ హిట్ అనే ఒకే మాట వినిపిస్తోంది. అంతేకాదు వరుణ్ తేజ్ వన్ మాన్ షో అని హై ఎనర్జీతో మాట్లాడుతున్నారు. ఇండిస్టీ నుండి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయడంతో మాకు మరింత ఎనర్జీ వచ్చింది. ఆయనతోపాటు అల్లు అర్జున్ ఫోన్ చేసి మాట్లాడారు. కొంతమంది అయితే 'హరీష్ నీ కెరీర్ బెస్ట్ వర్క్' అన్నారు. బహుశా ఫస్ట్ టైమ్ నా సినిమాలో వినోదంతోపాటు ఎమోషన్ కూడా బాగా పండింది. అలాగే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ రెండు షేడ్స్లో అద్భుతంగా నటించారు. 'ఎల్లువొచ్చి గోదారమ్మ ' సాంగ్కి భీమవరంలో ఆడియెన్స్ స్టేజి ఎక్కి డాన్స్ వేశారు. వరుణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశారు. సినిమా ఆయన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. మున్ముందు ఇది అత్యధిక కలెక్షన్లను రాబట్టే చిత్రమవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో విజువల్స్ ఇంత బాగా రావడానికి మా సినిమాటోగ్రాఫర్ అయనాంక బోస్ కారణం. అలాగే మిక్కీ పాటలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో కూడా అదరగొట్టాడు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంటగారికి కృతజ్ఞతలు. సినిమాలో కనిపించే హీరో వరుణ్ అయితే, కనపడని హీరో సినిమా. సినిమానే అతన్ని మార్చింది. గురువారం సాయంత్రానికి నా సినిమా ఏంటో ఈ ప్రపంచానికి తెలీదు. శుక్రవారం సినిమా చూసిన వాళ్ళంతా నా సినిమానే ప్రపంచం అంటున్నారు. మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుందని మేము అనుకోలేదు. టైటిల్ వివాదం బాధపెట్టింది. ఇందులో ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు, కానీ సినిమా మాత్రం గెలిచింది' అని అన్నారు. 'నిన్న రాత్రి మా ఎవ్వరికి నిదరపట్టలేదు. ఎప్పుడైతే ప్రీమియర్ షోస్ పడ్డాయో అప్పట్నుంచి పాజిటివ్ టాక్తో మాకు నిద్రపట్టకుండా చేశారు. మార్నింగ్ చిరంజీవిగారు, అల్లు అరవింద్గారు ఫోన్ చేసి అభినందించారు. అప్పటి నుండి నిరంతరాయంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇది నా ఒక్కడి విజయం కాదు. మా టీం అందరి విజయం. సినిమా స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్' అని వరుణ్ తేజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబాబుతోపాటు చిత్ర బృందం పాల్గొని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.