Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎనై నోకి పాయుమ్ తోట'. ఈ చిత్ర తెలుగు విడుదల హక్కులను విజరు భేరీ పతాకంపై జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి దక్కించుకున్నారు. తెలుగులో దీన్ని 'తూటా' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, 'ధనుష్, గౌతమ్ మీనన్ ఫస్ట్ టైమ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. రొమాంటిక్ థ్రిలర్గా తెరకెక్కింది. హీరో దగ్గుబాటి రానా ఇందులో అతిథి పాత్రలో నటించడం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దీనికి ధర్బుక శివ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస, ఎస్.ఆర్.కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం' అని తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఆర్ట్: రాజీవన్.