Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, ఇషారెబ్బా హీరోహీరోయిన్లుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
'రాగల 24 గంటల్లో'. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించారు. త్వరలో చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ 'వినోదాత్మక చిత్రాలు 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్ళీ మొదలైంది', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్'తో నవ్వించి, సోషియో ఫాంటసీ 'ఢమరుకం'తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్గా తాజా సినిమాని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన రెండు పోస్టర్లకి అద్భుతమైన స్పందన లభించింది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్ సైతం విశేషంగా ఆకట్టుకుంది. వాటిలాగే సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ నెల 25న టీజర్ విడుదల చేస్తాం. వచ్చే నెల 18న సినిమా విడుదల చేయాలను కుంటున్నాం. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘు కుంచె బ్యాక్గ్రౌండ్ స్కోర్తోపాటు, 'గరుడ వేగ' ఫేమ్ అంజి కెమెరావర్క్ సినిమాకి హైలెట్గా నిలుస్తాయి' అని అన్నారు. శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రధారులుగా కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, 'టెంపర్' వంశీ, అజరు, అనురాగ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.