Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' చిత్రం రూపొందుతుంది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం చిత్ర ఫస్ట్లుక్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వస్తోంది. ఆగస్టు 26 నుంచి రాజమండ్రి, పెండ్యాల, పురుషోత్తమ పట్నం, వంగలపూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. ఈనెల 25 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో రూ.35 లక్షల వ్యయంతో వేసిన భారీ జాతర సెట్లో కల్యాణ్రామ్, నటాషా దోషిలపై ఓ పాటని షూట్ చేేశాం. ఇందులో 50 మంది డ్యాన్సర్లు, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. పెండ్యాలలోని ఇసుక ర్యాంపుల మధ్య భారీ ఎత్తున తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అల్టిమేట్గా ఉంటుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని చెప్పారు.
'అనుకున్న ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరుగుతుంది. రాజమండ్రి పరిసరాల్లోని అందాలను మరోసారి చూపించబోతున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకూ హైదరాబాద్లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత నాల్గొవ షెడ్యూల్ని కేరళ, కర్ణాటకల్లో జరుపుతాం. ఇందులో కొన్ని ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కల్యాణ్రామ్గారి కెరీర్లో ఇది భారీ చిత్రంగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది' అని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. వి.కె.నరేష్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామాంజనేయులు.