Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చాణక్య'. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, ''పంతం' తర్వాత మరోసారి గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరి జంట ఆకట్టుకుంటుంది. యాక్షన్ నేపథ్యంలో స్పై థ్రిల్లర్గా సినిమా రూపొందుతుంది. ఇందులో గోపీచంద్ చేసే యాక్షన్ ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్ 5న సినిమాని విడుదల చేయనున్నాం. ఇప్పటికే విడుదలైన టీజర్కి విశేషమైన స్పందన లభించింది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది' అని తెలిపింది.