Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'డిక్టేటర్' చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ,'తెలుగు సినిమా ఇండిస్టీ ప్రస్తుతం ఎగ్జయిట్ ఫేజ్లోఉంది. ఇక్కడ గొప్ప కథలు, రచయితలు, నటీనటులున్నారు. ఇలాంటి ఇండిస్టీలో మేం కూడా పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 'శ్రీమంతుడు' సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ, శ్రీవాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'డిక్టేటర్'లో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. రచయితలు కోనవెంకట్, గోపీమోహన్ అత్యద్భుతమైన కథను అందించారు.' అని అన్నారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ,'డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థగా అగ్రగామిగా ఉన్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. విజయవంతంగా 'డిక్టేటర్' తొలి షెడ్యూల్ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ను యూరప్లో చేయబోతున్నాం. ఈ షెడ్యూల్లో కొంత టాకీపార్ట్, యాక్షన్, పాటల్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం.పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకముందెన్నడూ లేని విధంగా స్టయిలీష్ లుక్తో కనిపిస్తారు' అని చెప్పారు. బాలకృష్ణ 99వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.