Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్స్గా ప్రియాంక చోప్రా, ఫ్రిదా పింటో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం అధికారిక కార్యక్రమం 'బేటీ బచావో, బేటీ పడావో'లో భాగంగా 'గర్ల్ రైజింగ్ - వో పడేగీ, వో ఉడేగీ' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నటించేందుకు ప్రియాంక చోప్రా, ఫ్రిదాపింటో అంగీకరించారు. తాజాగా మాధురీ దీక్షిత్, నందితాదాస్,సుస్మితాసేన్, కరీనాకపూర్, అలియాభట్, పరిణీతి చోప్రా కూడా నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. 'ఇటువంటి సందేశాత్మక చిత్రాల్లో ముఖ్యంగా బాలికల సంరక్షణ, వారి ఆరోగ్యం, వారి విద్య తదితర అంశాలపై విస్తృతమైన అవగాహక కల్పించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి ఓ సూచికగా పనికొచ్చే ఇటువంటి చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని కరీనా తెలిపింది. కరీనా తాజాగా సల్మాన్ఖాన్ సరసన నటించిన 'భజరంగీ భాయిజాన్' చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి విదితమే.