Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ పతాకంపై ప్రేమ్సాయి దర్శకత్వంలో గౌతంమీనన్ నిర్మిస్తున్న చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సుధాకర్రెడ్డి ఆడియో సిడిలను ఆవిష్కరించగా, అఖిల్ అక్కినేని థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌతంమీనన్ మాట్లాడుతూ, 'తెలుగులో ప్రొడ్యూసర్గా చేస్తున్న మొదటి సినిమా ఇది. ప్రేమ్సాయి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పాడు. సుధాకర్రెడ్డిగారు మంచి సహకారం అందించారు. ఆయన వలనే మా సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో కార్తీక్ మూడు పాటలను, అనూప్ ఒక పాటను స్వరపరిచారు' అని అన్నారు. 'గౌతంగారితో పని చేయడం ఓ వరం. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు' అని దర్శకుడు ప్రేమ్సాయి చెప్పారు. 'ప్రపంచంలో ఉండే ప్రతి ఇద్దరి వ్యక్తులను ఓ బంధం కలుపుతుంది. నితిన్, డైరెక్టర్ ప్రేమ్సాయి, గౌతమ్మీనన్ ఈ ముగ్గురిని ఆ బంధమే నాతో కలిపింది. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి నిమిషం ఎగ్జైట్మెంట్తో నడుస్తుంది. నితిన్ కెరీర్లోనే బెస్ట్ ఫిలిం ఇది' అని కోనవెంకట్ అన్నారు. 'దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా ఇండిస్టీలో ప్రతి ఒక్కరికీ కష్ట సమయం ఉంటుంది. 'ఇష్క్' సినిమా ముందు వరకు నాకూ కష్ట సమయం గడిచింది. 3 సంవత్సరాల నుండి రేష్మ, గౌతమ్ మీనన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా డిఫరెంట్గా ఉండే చిత్రమిది. గౌతమ్మీనన్, ప్రేమ్సాయి కూడా ఈ సినిమాకి హీరోలే' అని నితిన్ చెప్పారు. 'రెగ్యులర్ సినిమాలా కాకుండా ట్రెండ్ను సెట్ చేసే సినిమా ఇది. కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో నితిన్ ఎప్పుడూ ముందుంటాడు. సినిమా, మ్యూజిక్ రెండూ చాలా బాగా వచ్చాయి' అని మరో హీరో నాగచైతన్య అన్నారు. 'గౌతమ్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో మంచి స్టోరీ ఉంటుంది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కూడా మంచి కథ ఉంటుందని భావిస్తున్నాను. ట్రైలర్స్ చూస్తుంటే నితిన్ నటనలో కొత్తదనం కనిపిస్తుంది. 3 సంవత్సరాలుగా ఈ సినిమాపై నితిన్ చాలా పాజిటివ్గా ఉన్నాడు. నితిన్ కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్గా నిలుస్తుంది' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రానా, నాని, వెంకటరత్న సుందరం, తాటి సునీత, రేష్మ, రామ్మోహన్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.