Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బేనర్స్పై నారాయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజతో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ క్లాప్ నివ్వగా, మరో నిర్మాత దిల్రాజు కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దేవుడి పటాలపై చిత్రీకరించారు ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ,' నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావుతో కలిసి నాగశౌర్య హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. 'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది అలాగే సంతోష్ ప్రామిసింగ్ డైరెక్టర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. 'ఏషియన్ సునీల్, శరత్ మరార్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం హ్యాపీగా ఉంది. సంతోష్ సెకండ్ ఫిలిమ్. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది' అని కథానాయకుడు నాగశౌర్య చెప్పారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ, 'ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఒక ఇమాజినరీ బయోపిక్లా ఉంటుంది. నాకు తప్పకుండా మైలేజ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమాలో మీరు సరికొత్త నాగశౌర్యని చూస్తారు' అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : మనోజ్ రెడ్డి.