Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ప్రతి రోజూ పండగే'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ రూపొందిస్తున్న భారీ చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకధాటిగా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ని అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. నేడు (మంగళవారం) కథానాయకుడు సాయి తేజ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.
'ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో అందరి మనసుల్ని చూరగొన్నారు. హీరో సాయి తేజ్ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్లో దర్శకుడు మారుతి చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది. జి.ఎ.2, యు.వి. పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్గా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, నిర్మాత బన్నీవాస్ సారధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సాయితేజ్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 'సుప్రీమ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సాయి తేజ్, రాశీ ఖన్నా మరోసారి కలిసి నటిస్తున్నారు. కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైన సత్యరాజ్ క్యారెక్టర్ని ఈ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో నటిస్తున్న మరో నటుడు రావు రమేశ్ పాత్ర కూడా హైలెట్గా ఉండనుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.