Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం అత్యంత వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా డా||రాజశేఖర్ మాట్లాడుతూ ''టైటిల్ బాగుంది. యూత్ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నా. పోలీస్ క్యారెక్టర్లు చేసే హీరోలందరూ ఈ వేదికపై ఉన్నారు. అబ్బూరి రవిది గోల్డెన్ హ్యాండ్. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు' అని అన్నారు.
'ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 19న నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నా' అని అడివి శేష్ చెప్పారు.
'సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే చెప్పే దేశభక్తి గీతం కలిగించింది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు లవర్ బారుగా, యాక్షన్ హీరోగా చూశాం. కానీ, ఆర్మీ అధికారిగా ఆది చాలా బాగా చేశాడు' జీవితా రాజశేఖర్ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''ఆదికి ఈ సినిమాతో మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. ఆయన మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకోవాలని, మళ్లీ మాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ఆయన కెరీర్లో మంచి సినిమా కావాలి' అని చెప్పారు.
దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ ''1990లో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు అబ్బూరి రవి ఇచ్చిన ధైర్యం, సపోర్ట్ వల్లే ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కింది. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఆర్.ఎస్.ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి అమిత్ షాగారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను. ఆది నటిస్తాడో? లేదో? అనుకున్నాను. తను సినిమా చేయడానికిి ముఖ్య కారణం సాయి కుమార్ గారు. ఆయన కథ విని చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ అన్నారు. ఆయనకూ థాంక్స్. 'వందేమాతరం' అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమాకు థియేటర్లలో అలాంటి రియాక్షన్ ఉంటుంది' అని తెలిపారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ ''కశ్మీర్ పండిట్లకు కన్నీళ్లు ఆపుకోవడం కష్టమయ్యేంత కష్టాలు ఉన్నాయి. ఎమోషన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను, వాళ్ల బాధను చెప్పడానికి మేం చేసిన చిన్న ప్రయత్నం. ఘాజీ బాబాగా ఎలా చేశానో దర్శకుడు సాయి కిరణ్ అడివి, ప్రేక్షకులే చెప్పాలి' అని అన్నారు.
''కశ్మీర్కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. ఈ రోజు మనమంతా ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నామంటే ఇండియన్ ఆర్మీనే కారణం. వాళ్లకు సెల్యూట్ చేయాలి. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది' అని ఆది సాయికుమార్ చెప్పారు.
'సైనికుల నేపథ్యంలో సినిమా తీయడం సంతోషంగా ఉంది. మేం యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకు సాయికిరణ్ పరిచయం అయ్యారు. ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది. సినిమా సూపర్గా వచ్చింది' అని నిర్మాత పద్మనాభరెడ్డి తెలిపారు.