Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా మొదటి సినిమా 'అమ్మా రాజీనామా' టైమ్లో ఎంత జాగ్రత్తగా, ఛాలెంజింగ్గా పని చేశానో, మళ్ళీ 'రాజుగారి గది 3'కి అంత భయంతో, అణిగిమణిగి వర్క్ చేశాను' అని అంటున్నారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్బాబు, అవికాగోర్ జంటగా నటించిన 'రాజుగారి గది 3' చిత్రానికి ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా మంగళవారం ఛోటా కె.నాయుడు మీడియాతో మాట్లాడుతూ, 'మొదటిసారి హర్రర్ కామెడీ చిత్రానికి పనిచేశాను. ఓంకార్ని ఓసారి ఓ లైవ్షోలో కలిశా. మేమిద్దరం 'జీనియస్', 'రాజుగారి గది'కి పని చేద్దామనుకున్నాం, కానీ కుదరలేదు. ఫైనల్గా ఈ సినిమా సెట్ అయ్యింది. పూర్తి వినోదాత్మకంగా సాగే పక్కా కమర్షియల్ చిత్రమిది. ఓంకార్ నాతో బాగా చేయించాడు. ఈ సినిమాకి ఎంత టైమ్ పనిచేస్తున్నామో అర్థమే కాలేదు. మొదటి సినిమాకి పనిచేసినట్టుగానే 16 గంటల కంటే ఎక్కువగానే వర్క్ చేశా. ఎక్కువగా రాత్రి సమయంలోనే తీశాం. ఇక హీరోగా అశ్విన్ నటన నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్. డైలాగ్స్, ఫైట్స్, డాన్స్లు ఇలా అన్నీ అద్భుతంగా చేశాడు. అలాగే అవికాగోర్ సైతం తనపై నాకున్న అభిప్రాయాన్ని మార్చేసింది. టీమ్ పర్ఫెక్ట్గా కుదిరింది. కచ్చితంగా ఇది విజయం సాధిస్తుంది. ఇన్నేండ్లలో ఎన్నో సినిమాలు చేశా, స్టార్స్ అందరితోనూ పనిచేశాను. ఇప్పుడు కొత్తగా, కంటెంట్ ప్రధానమైన సినిమాలు చేయాలనుకుంటున్నా. కొత్త దర్శకులు కొత్త ఐడియాస్తో వస్తున్నారు. వారితో పనిచేసినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్కి నామినేట్ అయ్యే సినిమాలు చూసి అప్డేట్ అవుతుంటాను. బేసిక్గా నేను యారోగెంట్ని. నాకు నచ్చినట్టు చేస్తా. నచ్చకపోతే చేయను. చాలా స్పీడ్గా ఉంటాను. దీంతో నన్ను తట్టుకోవడం కొందరికి కష్టంగా అనిపిస్తుంది. అది నన్ను అర్థం చేసుకున్నదాన్ని బట్టి ఉంటుంది. 'ఠాగూర్' టైమ్లో వినాయక్ సైతం నన్ను కెమెరామెన్గా అనుకున్నప్పుడు వెనకడుగు వేశారు. నాతో వర్క్ చేశాక నేనేంటో తెలిసింది. కెమెరామెన్గా నాకు యాక్షన్, లవ్ స్టోరీస్ ఇష్టం. కొరియోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. డైరెక్షన్ చేయడం, హీరోగా చేయడం చాలా కష్టం. మంచి బలమైన కంటెంట్ ఉన్న కథ దొరికితే భవిష్యత్లో దర్శకత్వం చేస్తా' అని చెప్పారు.