Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శుద్ధ్ దేశీ రొమాన్స్'తో కథానాయికగా పరిచయమైన వాణి కపూర్ గడచిన ఆరేండ్లలో కేవలం 'ఆహా కళ్యాణం', 'బేఫికర్' వంటి రెండు చిత్రాల్లోనే నటించారు. ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కాంబినేషన్లో రూపొందిన 'వార్'తో కెరీర్ పరంగా వాణి మంచి బ్రేక్ అందుకుంది. ప్రస్తుతం భారీ హిస్టారికల్ పీరియడ్ డ్రామా 'షంషేర్'లో నటిస్తున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ సరసన వాణి నటిస్తున్నారు. సంజరు దత్ కీలక పోషిస్తున్నారు. 'రణ్బీర్ స్టార్ హీరో అయినప్పటికీ ఎక్కడా తన ఇమేజ్ని కనిపించనివ్వరు. సెట్లో చాలా సింపుల్గా, కూల్గా, రిలాక్డ్స్గా ఉంటారు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. ఆయనతో భారీ పీరియడ్ చిత్రం చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'వార్'. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. అలాగే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోయే 'షంషేర్' సైతం కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నా. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్వాళ్ళపై ట్రైబల్స్ చేసిన పోరాటం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. సినిమా విడుదలయ్యాక అందరూ నా పాత్ర గురించి గ్యారంటీగా మాట్లాడుకుంటారు' అని వాణికపూర్ తెలిపింది.