Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జీరో' పరాజయంతో డిజప్పాయింట్ అయిన షారూఖ్ ఖాన్ ఇప్పటి వరకు తన కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించలేదు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వినిపించిన విషయం విదితమే. తాజాగా ఆయన దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా 'రాజారాణి' రీమేక్లో షారూఖ్ నటించనున్నారట. ఉత్త్తరాది ఆడియెన్స్కి ఈ కథ బాగా సూట్ అవుతుందని షారూఖ్ ఈ రీమేక్లో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారట. త్వరలోనే ఇది ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అట్లీ దర్శకత్వంలోనే నయనతార, ఆర్య, నజ్రినా నజీన్, జై ప్రధాన పాత్రధారులుగా నటించిన 'రాజారాణి' ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఇందులో ఆర్య పాత్రలో షారూఖ్ కనిపిస్తారని టాక్. అట్లీ ప్రస్తుతం విజయ్ హీరోగా 'విజిల్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో షారూఖ్ గెస్ట్ రోల్లో మెరవబోతున్నారట.