Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎలాంటి పాటలు, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్, థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం 'ఖైదీ'. ఇది అన్ని వర్గాల ఆడియెన్స్ని థ్రిల్ చేసే చిత్రమవుతుంది' అని హీరో కార్తీ అన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'ఖైదీ'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే డిఫరెంట్ యాక్షన్ థ్రిలర్ చిత్రమిది. పాటలు, హీరోయిన్ లేకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కార్తీ చేసిన 'యుగానికొక్కడు', 'ఆవారా', 'నాపేరు శివ', 'ఊపిరి', 'ఖాకీ' వంటి డిఫరెంట్ సినిమాల తర్వాత వస్తున్న మరో విభిన్నమైన చిత్రం. కార్తీ సినిమాల్లోనే ఇదొక వైవిధ్యమైన సినిమా అవుతుంది. ప్రారంభం నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మా బ్యానర్పై ఈ సినిమాని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్., సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్.