Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లతా సంగరాజు, గీతా సింగ్, భద్రం, కేదార్శంకర్ ప్రధాన పాత్రధారులుగా హుస్సేన్(ఏ.ఎండీ) దర్శకత్వంలో బి.వి.ఎస్.ఆర్ క్రియేషన్స్, మీజా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బి.వి సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నేత్ర'. ఈ చిత్ర ఫస్ట్లుక్ని 'మా' అధ్యక్షుడు నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హుస్సేన్ మాట్లాడుతూ, 'ఫస్ట్ లుక్ని విడుదల చేసిన నరేష్కి ధన్యవాదాలు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
లతా సంగరాజు, గీతా సింగ్, భద్రం ఇలా ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్స్లో చాలా బాగా నటించారు. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. రఘునాథన్ సినిమాటోగ్రఫి, రాజ్కిరణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. నిర్మాత సుబ్బారెడ్డి గారు సినిమాపై ఎంతో ఫ్యాషన్తో మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ప్రస్తుతం సెన్సార్కి సిద్దంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్ని ఉన్న చిత్రమిది' అని అన్నారు. సంధ్యా జానక్, ఆర్యన్, కృష్ణ, హన్సిత, నిట్టల, స్యరూప తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రఘునాథన్ చక్రవర్తుల, సంగీతం: రాజ్కిరణ్, ఎడిటింగ్: వినోద్ అద్వారు.