Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్ వున్నా, ప్రియాంక శర్మ జంటగా సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మిస్తున్న చిత్రం 'సరోవరం'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ యడవల్లి మాట్లాడుతూ, 'సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్గా సాగే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రల్లో బాగా నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఈ నెల 18న విడుదల చేస్తున్నాం. సినిమాను థియేటర్లో చూసి ఆశీర్వదించండి' అని అన్నారు. 'సినిమాను అందరూ ఇష్టపడి తీశాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అన్ని వర్గాల ఆడియెన్స్కి నచ్చే చిత్రమవుతుంది' అని నిర్మాత నిర్మాత ఎస్.శ్రీలత తెలిపారు. 'అందమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిగింది. మాస్కు కావాల్సిన అంశాలతోపాటు యూత్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఉంటాయి' అని జబర్దస్త్ నవీన్, రాము చెప్పారు.