Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలియా భట్ తాజాగా బయోపిక్లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తి జీవితాల ఆధారంగా బాలీవుడ్లో 'మూర్తి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కబోతోంది. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా దర్శకురాలు అశ్వని అయ్యర్ తివారీ ఈ బయోపిక్ని రూపొందించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇందులో సుధా మూర్తి పాత్రలో అలియాభట్ కనిపించనున్నారట. దీని కోసమై అలియాతో చిత్ర బృందం చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ బయోపిక్లో అలియా నటించేందుకు ఎగ్జైట్గా ఉందని తెలుస్తోంది. ఇదే సెట్ అయితే అలియా నటించే తొలి బయోపిక్ ఇదే అవ్వడం విశేషం. 'సడక్ 2', 'తఖ్త్', 'బ్రహ్మాస్త్ర', 'గుంగూబాయి', 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాల్లో నటిస్తూ అలియా ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు దర్శకురాలు అశ్వని కూడా ప్రస్తుతం కంగనా రనౌత్ కథానాయికగా 'పంగా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.