Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్ళిచూపులు' నాకు బాగా నచ్చిన చిత్రం. విజయ్ నిర్మాతగా చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలి' అని మహేష్బాబు అన్నారు.
తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రధారులుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. కింగ్ ఆఫ్ ది హిల్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ని బుధవారం మహేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. విజయ్ నిర్మాతగా, తరుణ్ హీరోగా అనగానే కాంబినేషన్ చాలా కొత్తగా, క్రేజీగా అనిపించింది. కాన్సెప్ట్ కూడా ఆసక్తికరంగా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి నిర్మాతగా మారాను. నిర్మాణ బాధ్యతలు మా నాన్నగారు వర్ధన్ దేవరకొండ తీసుకున్నారు. నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయనకు చాలా థ్యాంక్స్. ఇది నా మనసుకు నచ్చిన సినిమా. అందరికి నచ్చుతుందని నమ్ముతున్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు. హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'ఇందులో నన్ను హీరో అంటున్నారు. కానీ నాకు నేను ఓ ఆర్టిస్టుగానే భావిస్తున్నా. అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ని దర్శకుడు షమ్మీర్ బాగా హ్యాండిల్ చేశాడు. కథా, కథనాలు సూపర్ ఫన్గా ఉంటాయి. విజరు ప్రొడక్షన్ కాబట్టి చాలా బాధ్యతగా పనిచేశా' అని చెప్పారు. 'ఈ సినిమా చేయడానికి కథ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది. తరుణ్ హీరో అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తన రోల్ని బాగా చేశాడు. ఒక యంగ్ టీం అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది' అని అనసూయ తెలిపారు. చిత్ర దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ, 'నాకు అవకాశం ఇచ్చిన విజయ్కి చాలా థ్యాంక్స్. ఇదొక ఇన్సిడెంట్ బేస్డ్గా ఉంటుంది. డైలాగ్స్ రాసిన తరుణ్ భాస్కర్కి థ్యాంక్స్. అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్తో ఎంటర్టైన్ చేయబోతున్నాం' అని చెప్పారు.