Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ అధినేత అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి అక్కినేని విజయలక్ష్మి (77) కన్నుమూశారు. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. మద్రాస్లో జన్మించిన విజయలక్ష్మి 1963లో రమేష్ ప్రసాద్ని వివాహం చేసుకున్నారు. సినీ కెరీర్లో రమేష్ ప్రసాద్కి అన్ని విధాలుగా అండగా నిలిచారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గురువారం సాయంత్రం ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో విజయలక్ష్మి అంత్యక్రియల్ని నిర్వహించారు.