Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ జంటగా బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మించిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా సినిమా చాలా బాగుందంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ చిత్ర టీమ్ని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పెళ్ళిచూపులు' తర్వాత నాకు అంత మంచి ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది. ట్రైలర్ చూసినప్పుడే నాకు ఇందులో ఏదో స్పార్క్ ఉందనిపించింది. సినిమాలో మంచి ఫైర్ ఉంది. చాలా ఆహ్లాదరకంగా ఉంది. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. ప్రొడ్యూసర్గా, హీరోగా రాకేష్ సక్సెస్ అయ్యాడు. టెక్నీషియన్స్ సినిమాకు బలం. శంకర్ మంచి డైరెక్టర్. బాగా చదువుకున్నాడు. చాలా మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా రైటింగ్ చాలా బాగుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్బ్. రాకేష్ పట్టుదల వల్లే హీరో, ప్రొడ్యూసర్ అయ్యాడు. హీరోయిన్ గార్గేయి చాలా బాగా చేసింది. కొన్ని సీన్స్లో హీరోను డామినేట్ చేసింది. ఇది దిగ్విజయంగా యాభై రోజులు ఆడాలి' అని అన్నారు.
'మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న అందరికి చాలా థ్యాంక్స్. లగడపాటిగారు మమ్మల్ని మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. పదేండ్ల కష్టం మాది. చాలా చోట్ల సినిమా హౌస్ఫుల్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది' అని హీరో రాకేష్ తెలిపారు. చిత్ర దర్శకుడు బసవ శంకర్ మాట్లాడుతూ, 'లగడపాటి శ్రీధర్గారు మమ్మల్ని పిలిచి అభినందించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ప్రోత్సహిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్' అని చెప్పారు. 'ఇంత మంచి ఎక్స్పీరియెన్స్ ఇచ్చిన నా టీమ్కు కృతజ్ఞతలు' అని హీరోయిన్ గార్గేయి చెప్పింది.