Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తిసురేష్ 'మహానటి' తర్వాత క్రేజీ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ని కొట్టేసిందట. శివ దర్శకత్వంలో రజనీ నటించే సినిమాలో హీరోయిన్గా ఎంపికైందని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఆమె నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా దిల్రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్స్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ బర్త్డేని పురస్కరించుకుని ఇటీవల కీర్తిసురేష్ ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'స్పోర్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నవంబర్ 11 నుంచి చివరి షెడ్యూల్ని చిత్రీకరించనున్నాం. దీపావళికి చిత్ర ఫస్ట్లుక్ని, టైటిల్ని విడుదల చేయనున్నాం' అని తెలిపారు. దీంతోపాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పెంగ్విన్' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.