Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'భారతీయుడు'కి సీక్వెల్గా 'భారతీయుడు 2' రూపొందుతుంది. దాదాపు 23ఏండ్ల తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ నేపథ్యంలో ప్రారంభం నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ యువకుడిగా, 90ఏండ్ల వృద్ధుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటి చిత్రానికి మించి ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. వాటిని భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు రూ.40కోట్లతో ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. దీన్ని యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల అనంతరం తైవాన్, యూరప్లో నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరించబోతున్నారు. భారీ బడ్జెట్తో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్యా రాజేష్, విద్యుత్ జమ్మాల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తు న్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొ చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.