Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రధారులుగా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్మెన్నార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'అన్నపూర్ణమ్మగారి మనవడు'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శివనాగు మాట్లాడుతూ, 'పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. అనుబంధాలు, ఆత్మీయతలు, పల్లెటూరి ప్రేమలను ఆవిష్కరిస్తుంది. ముద్దపప్పు, ఆవకాయ సమ్మేళనంతో భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో, ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సీనియర్ నటి జమున అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు. సీనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో ఎంతో ఆహ్లాదభరిత వాతావరణంలో అమరావతి సమీపాన గల వైకుంఠపురం అనే పచ్చని పల్లెటూరిలో ఈ చిత్ర షూటింగ్ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది' అని అన్నారు. 'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ వర్క్ జరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేసి నవంబర్లో సినిమాని విడుదల చేస్తాం. విలన్గా బెనర్జీ నటన, బాలాదిత్య, అర్చన ప్రేమ సన్నివేశాలు అలరిస్తాయి. రఘుబాబు, జీవా, తాగుబోతు రమేష్, కారుమంచి రఘు, సుమన్ శెట్టి తమదైన హాస్యంతో నవ్వులు పూయిస్తారు' అని నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి అన్నారు.