Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన పాపులారిటీని మన భారతీయ సినిమా కోసం ఉపయోగించబోతోంది. ఆస్కార్లో భారతీయ సినిమా సత్తాని నిరూపించేందుకు తన వంతు కృషి చేస్తుంది. 92వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం మన దేశం నుంచి బాలీవుడ్కి చెందిన 'గల్లీబాయ్' చిత్రం అధికారికంగా ఎంపికైంది. ఈ సినిమా విదేశీ విభాగంలో నామినేషన్ కోసం పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ సినిమాపై అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ప్రియాంక సిద్ధమైంది. ఇటీవల లాస్ ఏంజెల్స్లో సినిమా స్క్రీనింగ్లో దర్శకుడు జోయా అక్తర్తో కలిసి పాల్గొంది. హాలీవుడ్ చిత్రాల్లో నటించిన నేపథ్యంలో ఏర్పడిన పరిచయాలతో వారందరికీ సినిమాని చూపించే పనిలో ఉంది. అలాగే వచ్చే ఏడాది జనవరి వరకు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతుందట. రణ్వీర్ సింగ్, అలియాభట్ జంటగా నటించిన ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించిన విషయం విదితమే. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు మూడేండ్ల గ్యాప్తో రీఎంట్రీ ఇస్తూ ప్రియాంక నటించిన 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.