Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా నిలుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటుందట. శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదని ఇటీవల
ఓ ప్రెస్మీట్లో ఆవేదన వ్యక్తం తెలిపి అందరికి షాకిచ్చింది. మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రకుల్ చెబుతూ, 'ఎన్నో సినిమాలు ఎంతో కష్టపడి చేశా. కానీ అవి ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. దీంతో నిరాశ చెందాను. అందుకే కొంతకాలం సినిమా రంగానికి దూరంగా ఉంటే మంచిదని భావిస్తున్నా. తమిళంలోనే కాదు, ఇప్పుడు ఇతర భాషల్లోనూ సినిమాలను అంగీకరించడం లేదు. మంచి కథ, బలమైన, నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తాను' అని తెలిపింది. ఈ ఏడాది రకుల్ 'ఎన్టీఆర్ కథానాయుడు', 'దేవ్', 'దే దే ప్యార్ దే', 'ఎన్జీకే', 'మన్మథుడు 2' వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఏ ఒక్కటీ విజయం సాధించకపోవడం గమనార్హం. ప్రస్తుతం తమిళంలో 'భారతీయుడు 2', శివకార్తీకేయన్ చిత్రం, హిందీలో 'మర్జావాన్'లో రకుల్ నటిస్తోంది. అలాగే తాజాగా అనిల్ కపూర్, రానా ప్రధాన పాత్రధారులుగా నేహా రాకేష్ దర్శకత్వంలో రూపొందే ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది మొసళ్ళ బ్యాక్డ్రాప్లో ఉండటం విశేషం.